గజ్వేల్ లో ఓడిపోతామనే భయంతోనే కామారెడ్డిలో పోటీ చేసేందుకు సిద్ధమవుతున్న ముఖ్యమంత్రి కేసీఆర్ ను డిపాజిట్లు లేకుండా ఓడిస్తామని బిజెపి నాయకులు నాయుడు రాజు అన్నారు. ఈ సందర్భంగా ఆయన సత్యం న్యూస్ ప్రతినిధితో మాట్లాడుతూ గజ్వేల్ అభివృద్ధి చూడ్డానికి వెళితే భాజపా నాయకులను అడ్డుకొని ఏం సాధించారన్నారు. గజ్వేల్ లో చేసిన అభివృద్ధి ఏమి లేక ఓడిపోతామన్న భయంతోనే కెసిఆర్ కామారెడ్డిని ఎంచుకున్నారన్నారు. అయినప్పటికీ కామారెడ్డిలో డిపాజిట్ రాకుండా చేస్తామన్నారు. భారతీయ జనతా పార్టీ నాయకులకు,కార్యకర్తలకు అకారణంగా అరెస్టు చేసి తీవ్ర మనోవేదనకు గురి చేశారని ఈ విషయం ప్రతి వ్యక్తికి తెలిసిపోయిందని, ఇక ఆయన ఓటమి ఆయనకు గత్యంతరమన్నారు. తనకు అధిష్టానం ఆదేశిస్తే జుక్కల్ నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా పోటీ చేసి భారీ విజయం సాధిస్తానన్నారు. జుక్కల్ నియోజకవర్గానికి స్థానిక శాసనసభ్యులు చేసిన అభివృద్ధి శూన్యం అన్నారు.
జి లాలయ్య, సత్యం న్యూస్.నెట్, జుక్కల్ నియోజకవర్గం