తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కేసిఆర్ ప్రభుత్వ కార్యక్రమాలతో రాష్ట్రం ఎంతో అభివృద్ధి చెందిందని, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో మెడికల్ కాలేజ్ ఏర్పాటు చేసుకోవడం గొప్ప విషయం అని, త్వరలో జిల్లాలో సిఎం కేసిఆర్ పర్యటించి పార్టీ కార్యాలయం తో పాటు కలెక్టరేట్ సముదాయం ప్రారంభిస్టారని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్, పినపాక శాసనసభ్యులు రేగా కాంతారావు పేర్కొన్నారు. పార్టీ కార్యాలయాన్ని, కలక్టరేట్ ను పరిశీలించి మాట్లాడుతూ రాష్ట్ర ప్రజలు సీఎం కేసీఆర్ పాలనలో జరుగుతున్న అభివృద్ధి సంక్షేమ పథకాలకు మద్దతు ఇస్తారన్నారు. ఈ ప్రాంతంలో మెడికల్ కళాశాల వరమని, ఇక్కడి ప్రజలకు నాణ్యమైన విద్యను అందించేందుకు చేసిన కృషి మరువలేనిదని అన్నారు. ఎంతోకాలంగా పోడు వ్యవసాయం చేసుకుంటూ కాలం వెళ్లదీస్తున్న రైతులకు సీఎం స్వయంగా తమ పర్యటనలో హక్కు పత్రాలు అందిస్తారని తెలిపారు.