ముషీరాబాద్ నియోజకవర్గంలోని ముషీరాబాద్ మండల్ మరియు హిమాయత్ నగర్ మండల్ 74 మంది లబ్ధిదారులకు స్థానిక ఎమ్మెల్యే ముఠాగోపాల్ కళ్యాణ లక్ష్మి,షాది ముబారక్ చెక్కులను గాంధీనగర్ డివిజన్లోని జవహర్ నగర్ కమిటీ హాల్లో పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ముఠాగోపాల్ మాట్లాడుతూ ….
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ఈ పథకం పేద ప్రజలకు ఎంతో ఆసరాగా నిలుస్తుందన్నారు. పేదల సంక్షేమానికి ప్రభుత్వం అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తుందని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ సహాయంతో ఎంతో మంది పేద కుటుంబాలకు పెండ్లిల భారం తగ్గిందని తెలిపారు. ఆడపిల్లల తల్లిదండ్రులు ఆర్థికంగా ఇబ్బంది పడవద్దు అనే ఉద్దేశంతో సీఎం కేసీఆర్ కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాలను ప్రవేశపెట్టారని అన్నారు.
ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు పావని వినయ్ కుమార్, రచన శ్రీ, రవి చారి, సుప్రియ నవీన్ గౌడ్ మరియు బిఆర్ఎస్ రాష్ట్ర యువనాయకులు ముఠా జై సింహ, బిఆర్ఎస్ సీనియర్ నాయకులు ముఠా నరేష్, బింగి నవీన్, ముషీరాబాద్ నియోజకవర్గ బిఆర్ఎస్ డివిజన్ ప్రెసిడెంట్లు వల్లల శ్యామ్ యాదవ్, నర్సింగ్ ప్రసాద్, కార్యదర్శులు పోతుల శ్రీకాంత్, సాయి కృష్ణ, దామోదర్ రెడ్డి, ఆకుల అరుణ్ కుమార్, వర్కింగ్ ప్రెసిడెంట్ కొండ శ్రీధర్ రెడ్డి, మరియు బిఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.