సీఎం కేసీఆర్ కు ఛాతిలో సెకండరీ ఇన్ఫెక్షన్ వచ్చిందని ఆయన కుమారుడు, మంత్రి కేటీఆర్ తెలిపారు. కొద్ది రోజుల క్రితం వైరల్ ఫీవర్ రావడంతో కేసీఆర్ విశ్రాంతి తీసుకుంటున్నారు. ఇప్పుడు బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ రావడం వల్ల కోలుకోవడానికి అనుకున్న సమయం కంటే ఎక్కువ కాలం పట్టే అవకాశం ఉందని మంత్రి కేటీఆర్ అన్నారు. వైరల్ ఫీవర్ వల్ల సీఎం కేసీఆర్ గత 3 వారాలుగా ప్రజలకు దూరంగా ఉంటున్న విషయం తెలిసిందే.