28.7 C
Hyderabad
May 5, 2024 08: 24 AM
Slider ముఖ్యంశాలు

కెసిఆర్ ను గద్దె దించడమే లక్ష్యం

#ponguleti

జెండా ఏదైనా ఎజెండా ఒకటేనని తెలంగాణలో కేసీఆర్ ప్రభుత్వాన్ని గద్దె దించి ఖమ్మం జిల్లాలో ఉన్న అధికార పార్టీ ఎమ్మెల్యేలను ఓడగొట్టడమే లక్ష్యమని ఖమ్మం మాజీ పార్లమెంటు సభ్యుడు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఘాటైన వ్యాఖ్యలు చేశారు. పాలేరు నియోజకవర్గంలోని తిరుమలాయపాలెం మండలం సమీపంలో జరిగిన ఆత్మీయ సమ్మేళనానికి హాజరైన వేలాదిమంది ప్రజల ను ఉద్దేశించి ఆయన ప్రసంగించారు. తెలంగాణ రాష్ట్రంలో ఎంతోమంది విద్యార్థుల ప్రాణ త్యాగాలతో సాధించుకున్న తెలంగాణలో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు. రాష్ట్రంలో సుమారు ఐదు లక్షల కోట్ల రూపాయలు అప్పుల్లో కోరుకుందని రాష్ట్రంలో ఉన్న ప్రతి మనిషి పై 1,35,000 అప్పు ఉందని అన్నారు స్వరాజ్యం సాధించుకున్న సమయంలో మిగులు బడ్జెట్ ఉన్న రాష్ట్రం ఇప్పుడు అప్పులలో ఉందని అన్నారు. ఖమ్మం జిల్లాలో భారీ ప్రాజెక్టు సీతారామ ప్రాజెక్టుగా చెప్పుకుంటున్న అధికార పార్టీ ప్రాజెక్టు నీళ్లతో పాలేరు ప్రజల కాళ్లు ఎప్పుడు కడుగుతారు చెప్పాలన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ బహిరంగ సభల్లోనూ అసెంబ్లీ సాక్షిగా చేసిన వాగ్దానాలు కాలేదని కేసీఆర్ మాయ మాటలు ప్రజలు నమ్మరని రానున్న రోజుల్లో జరిగే ఎన్నికల కురుక్షేత్రంలో అధికార పార్టీని మట్టి కరిపించడమే లక్ష్యమన్నారు. తెలంగాణ రాష్ట్రంలో రైతులు తీసుకున్న వ్యవసాయ రుణాలను మాఫీ చేస్తానని రెండోసారి అధికారంలోకి వచ్చిన కేసీఆర్ ఇంతవరకు ఐదు లక్షల మందికి రుణమాఫీ చేశారని ఇంకా 31 లక్షల మంది చేయాల్సి ఉందని అన్నారు ఇంకా ఎన్నికలకు ఏడు నెలల సమయం ఉందని ఎప్పుడు రుణమాఫీ చేస్తారని ఆయన విమర్శించారు.
మద్దినేని బేబీ స్వర్ణకుమారి ఎమ్మెల్సీ తాత మధు పై సంచలన వ్యాఖ్యలు చేశారు.

పొంగులేటి ఆత్మీయ సమ్మేళనంలో తాత మదు పై స్వర్ణ కుమారి ఘాటైన వ్యాఖ్యలు మాట్లాడారు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిని విమర్శించే స్థాయి నీకు లేదని పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ప్రజల ఆదరణ పొందాడని దమ్ముంటే నీ పదవులు ఎలా వచ్చాయో నాకు తెలుసు అని ఎవరికి ఊడిగం చేసి పదవి సంపదించావో ఎవరికి పెగ్గు కలిపి జిల్లా అధ్యక్షుడు పదవి పొందావో తెలపాలి నీ సొంత గ్రామమైన పిండిప్రోలులో ఒక వార్డు కి గెలవలేవు. గెలిచిన తర్వాత మాట్లాడు పొంగులేటి పై విమర్శలు మానుకో తాత మధు డబ్బు పెట్టి కొనుక్కున్న పదవులు చేస్తాం కాదు ప్రజాదరణతో గెలిచినవాడు ఓడిన గెలిచిన ప్రజల్లో ఉంటాడు ఆయనే పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. ఆత్మీయ సమ్మేళనానికి నేలకొండపల్లి ఖమ్మం రూరల్ కూసుమంచి తిరుమలయపాలెం మండలం నుంచి పార్టీలకు అతీతంగా భారీగా పొంగులేటి అభిమానులు హాజరయ్యారు. ఆత్మీయ సమ్మేళనానికి చావా శివరామకృష్ణ రామసహాయం నరేష్ రెడ్డి ఆధ్వర్యంలో తిరుమలాయపాలెం మండల పరిధిలోని వేలాది మంది ప్రజలు హాజరయ్యారు.ఈ కార్యక్రమంలో మద్దినేని బేబీ స్వర్ణకుమారి, చావా శివరామకృష్ణ రామ సహాయం నరేష్ రెడ్డి, బుర్ర రాజశేఖర్, వైరా నియోజకవర్గ అభ్యర్థి విజయ భాయ్, కార్పొరేటర్ దొడ్డ నగేష్, మాజీ ఎంపీపీ కోప్పుల అశోక్, తుళ్లూరు బ్రహ్మయ్య, నెల్లూరు భద్రయ్య, వెంకట్ రెడ్డి, కొడాలి బాబు, చెరువు స్వర్ణ సుబ్రహ్మణ్యం, రవీంద్రబాబు, జీవన్ రెడ్డి, శివ సాగర్, అజ్మీర్ అశోక్, కిషోర్ రెడ్డి, దుబ్బాకుల వెంకటేశ్వర్లు, ఎన్ వి శేషు, కొప్పుల చంద్రశేఖర్, తంబూరు దయాకర్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

Related posts

ఖమ్మం నగరాభివృద్ధికి ప్రభుత్వం పూర్తిగా సహకరించింది

Satyam NEWS

వనపర్తిలో జిల్లా పోలీస్ కార్యాలయం భవనం ప్రారంభం

Satyam NEWS

క‌ళాశాల విద్యార్దుల‌తో విజయనగరం ఎస్పీ దీపిక ముఖాముఖీ

Satyam NEWS

Leave a Comment