అన్ని వసతులను కల్పించి ఖమ్మం నగరాన్ని సుందర నగరంగా తీర్చి దిద్దామని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ తెలిపారు. ఖమ్మం నగరపాలక సంస్థ పరిధి పలు డివిజన్లలో రూ.60 లక్షలతో చేపట్టిన అభివృద్ధి పనులను మంత్రి ప్రారంభించారు.
ఈ సందర్భంగా 16వ డివిజన్ దంసలాపురం న్యు కాలనిలో రూ.20 లక్షలతో, 18వ డివిజన్ రామకృష్ణ నగర్ లో రూ.20 లక్షలతో, 19వ డివిజన్ శ్రీరాం నగర్ రోడ్ నెం.1 లో రూ.20 లక్షలతో వి.డి.ఎఫ్ టెక్నాలీజతో సి.సి రోడ్లను నిర్మించడం జరిగిందన్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా నగరంలో డివైడర్స్, సెంట్రల్ లైటింగ్, జంక్షన్ల నిర్మాణలు పూర్తి చేసి హైద్రాబాదు నగరానికి ధీటుగా నగరాన్ని తీర్చిదిదామన్నారు.
కార్యక్రమంలో నగర మేయర్ పునుకొల్లు నీరజ, సుడా చైర్మన్ విజయ్ కుమార్, మున్సిపల్ కమిషనర్ ఆదర్శ్ సురభి, కార్పొరేటర్లు మెడారపు వెంకటేశ్వర్లు, మందడపు లక్ష్మీమనోహర్, చామకూరి వెంకన్న, రైస్ మిల్లర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు బొమ్మ రాజేశ్వరరావు, కొల్లు పద్మ, స్థానిక ప్రజాప్రతినిధులు అంజిరెడ్డి, పరమేష్ తదితరులు పాల్గొన్నార