27.7 C
Hyderabad
May 4, 2024 10: 15 AM
Slider ప్రత్యేకం

తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడుగా కిషన్ రెడ్డి

#kishanreddy

కేంద్ర మంత్రి వర్గంలో బండి సంజయ్ కు చోటు

అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో తెలంగాణ రాజకీయాల్లో అనూహ్య మార్పులు చోటు చేసుకుంటున్నాయి. తెలంగాణాలో కాంగ్రెస్ పార్టీ వైపు రెడ్డి సామాజిక వర్గం మొగ్గు చూపడం, రోజు రోజుకూ బీజీపీలో అసమ్మతి, అసంతృప్తి పెరుగుతున్న నేపథ్యంలో అధిష్టానం తెలంగాణా పై దృష్టి సారించింది. ఈ తరుణంలో పార్టీని పటిష్టం చేసేందుకు పార్టీలో మార్పులు, చేర్పులకు నిర్ణయం తీసుకుంది. రెడ్డి సామాజి వర్గం నేతలు కాంగ్రెస్ వైపు వలసలు అడ్డుకునేందుకు ప్రస్తుత కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి రాష్ట్ర అధ్యక్ష పదవి కట్టబెట్టనున్నట్లు సమాచారం.

కిషన్ రెడ్డికి అధ్యక్ష పదవీ ఇవ్వడం ద్వారా పార్టీలో పాత కొత్త వారిని కలుపుకు పోవడానికి అవకాశం వుంటుందని అధిష్టానం భావిస్తోంది. కాపు, బీసీ సామాజిక వర్గాన్ని సంతృప్తి పరచడంతో పాటు బండి సంజయ్ దూకుడు తగ్గకుండా వుండేందుకు కేంద్ర మంత్రి వర్గంలో స్థానం కల్పించనున్నట్లు తెలుస్తోంది. అలాగే పార్టీలోకి వలస వచ్చిన ఇతర పార్టీల నేతలు ఇతర పార్టీల వైపు చూడకుండా వుండేందుకు, ఈటెల రాజేంద్ర కు పార్టీ ప్రచార కమిటీ చైర్మన్ బాధ్యతలు అప్పజేప్పే అవకాశం వున్నట్లు వార్తలు వెలువడుతున్నాయి. అదే విధంగా తెలంగాణ బీజేపీలో జోష్ నింపేందుకు ఢిల్లీ అధిష్టానం పలు కీలక మార్పులు చేపట్టనున్నట్లు తెలుస్తోంది.

Related posts

కాకతీయ విద్యార్థి సునీల్ ది ముమ్మాటికి ప్రభుత్వ హత్యే

Satyam NEWS

శ్రీ గణపతి సచ్చిదానంద స్వామి ఆశ్రమానికి సీఎం వైఎస్‌ జగన్‌

Satyam NEWS

కేజీబీవీ స్కూల్ లో కలెక్టర్ ఆకస్మిక తనిఖీ

Satyam NEWS

Leave a Comment