సీనియర్ జర్నలిస్ట్, ఏపీయూడబ్ల్యూజే నేత అంబటి ఆంజనేయులు మృతి చెందిన సంగతి తెలిసిందే. ఈ మేరకు విజయనగరం అంబటి సత్రం వద్ద ఉన్న ప్రెస్ క్లబ్ లో ఏపీయూడబ్య్లూజే నివాళి అర్పించింది. ఈ సందర్భంగా సీనియర్ జర్నలిస్ట్ పంచాది అప్పారావు అధ్యక్షతన ప్రెస్ క్లబ్ లో సంతాప సభ జరిగింది. యూనియన్ రాష్ట్ర నేత పీ.ఎస్.ఎస్.వీ ప్రసాద్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అలాగే అంబటి ఆంజనేయులు తో పరిచయం ఉన్న సీనియర్ జర్నలిస్ట్ సురేష్… అలాగే రాధాకృష్ణ, లక్ష్మణ్, త్రినాథ్, పాత్రో ,శర్మ ఇతర జర్నలిస్టుల పాల్గొన్నారు.
previous post