హైదరాబాద్ అంబర్ పేట్ డివిజన్ లోని మున్సిపల్ గ్రౌండ్ లో నిర్వహిస్తున్న బతుకమ్మ సంబరాలకు కేంద్ర పర్యాటక, సాంస్కృతిక, ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధి శాఖ మంత్రి జి. కిషన్ రెడ్డి ముఖ్యఅతిధిగా హాజరయ్యారు. స్థానిక అంబర్ పెట్ కార్పొరేటర్ ఈ విజయ్ కుమార్ గౌడ్, టీఆర్ఎస్ సీనియర్ నాయకులు దూసరి శ్రీనివాస్ గౌడ్ కార్యక్రమంలో పాల్గొని ఆయనను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ పార్టీ నాయకులు మహేష్ ముదిరాజ్, తిరుపతి, నాగరాజు, రంగు ఉదయ్ గౌడ్, సంతోష్ చారి, దినేష్, హేమంత్ తదితరులు పాల్గొన్నారు.
సత్యం న్యూస్, అంబర్ పేట్