సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్లో 5th ఇంటర్నేషనల్ కైట్ అండ్ స్వీట్ ఫెస్టివల్ ఏర్పాట్లు ను రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ కార్యదర్శి బుర్రా వెంకటేశం ఇతర ప్రభుత్వ అధికారులతో కలసి పర్యవేక్షించారు. ఈ నెల 13 , 14, 15 తేదీల్లో జరగనున్న అంతర్జాతీయ కైట్, స్వీట్, స్నాక్స్ పెస్టివల్ తో పాటు తెలంగాణ రాష్ట్ర స్థాయి సంప్రదాయక ఆటలను నిర్వహిస్తున్నామన్నారు.
25 దేశాలకు చెందిన వారు ఈ కైట్ ఫెస్టివల్లో పాల్గొంటారని వెల్లడించారు. దేశం నలుమూలల నుండి పెద్ద ఎత్తున కైట్ ప్లేయర్ లు, సందర్శకులు ఈ ఫెస్టివల్లో పాల్గొంటారన్నారు. పరేడ్ గ్రౌండ్లో ఏర్పాట్లను పర్యవేక్షించిన బుర్రా వెంకటేశం, ఈ ఫెస్టివల్ లో కైట్ ల, స్వీట్ ల తో పాటు స్నాక్స్ ఫెస్టివల్ కూడా జరుగుతుందన్నారు. స్పోర్ట్స్ డిపార్ట్మెంట్ నుండి జింఖానా మైదానం లో పురాతన సాంప్రదాయ బద్ధమైన క్రీడలు నిర్వహిస్తారు.
రాబోయే కాలంలో వారం రోజుల పాటు ఈ ఫెస్టివల్స్ జరుపుతామన్నారు. అన్ని రకాల సాంప్రదాయబద్ధమైన పాటలు, సాంస్కృతిక కార్యక్రమాలు , షాపింగ్, వంటకాలు అన్ని ఏర్పాట్లను అందుబాటులో ఉంచుతామన్నారు. ప్రతి ఒక్కరు ఈ సంక్రాంతి పండుగను పురస్కరించుకుని సందర్శించవచ్చు అని తెలిపారు.
ఈ కార్యక్రమంలో M D టూరిజం మనోహర్ గారు, GHMC జోనల్ కమిషనర్ శ్రీనివాస్ రెడ్డి, ఇతర అధికారులు, పోలీసు శాఖ నుండి అదనపు డిప్యూటీ కమిషనర్ శ్రీనివాస్, ACP బేగంపేట నరేష్ రెడ్డి, ఇన్స్పెక్టర్ శ్రీనివాసరావు, టూరిజం అధికారులు శశిధర్ , ఓంప్రకాశ్, ట్రాఫిక్ అధికారులు దాశ్రు నాయక్, వాటర్ వర్క్స్ అధికారులు రఘునందన్ రెడ్డి లతో పాటు అనుబంధ శాఖల ప్రభుత్వ అధికారులు పాల్గొన్నారు.