కడప జిల్లా నందలూరు లోని ప్రసిద్ద శ్రీ సౌమ్యనాధ స్వామి బ్రహ్మోత్సవాలల్లో ఐదవ రోజు రాత్రి సౌమ్యనాధ స్వామి హనుమంతు వాహనంపై పై కోదండరామ స్వామిగా దర్శన మిచ్చారు. మాడ వీధుల్లో ఊరేగుతూ భక్తులకు దర్శనమిచ్చారు. నలు వైపులా భక్తులు చేతులెత్తి మొక్కుతుండగా గోవింద నామ ఘోషల నడుమ శ్రీ కోదండరామ స్వామి పుర వీధుల్లో రంజిల్లుతూ విహరించారు.
మంగళ వ్యాయిద్యాలు,బాజా బజంత్రీలు మ్రోగుతుండగా, భక్తుల నీరాజనాల మధ్య వాహన సేవ వైభవంగా సాగింది. బ్రహ్మోత్సవాల సందర్భంగా నందలూరు కు భారీగా భక్తులు తరలివచ్చారు. భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు.ఆలయ ప్రాంగణం మొత్తం రంగు రంగు విద్యుత్ దీప కాంతులతో అలంకరించారు.