కడప జిల్లాలోని ఒంటిమిట్ట కోదండ రామాలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలను టిటిడి వైభవపేతంగా నిర్వహిస్తుంది. శ్రీవారి సేవకుల ద్వారా తలంబ్రాల తయారీ ప్రారంభించింది. శ్రీరామనవమి బ్రహ్మోత్సవాల సందర్భంగా ఏప్రిల్ 15న జరగనున్న సీతారాముల కల్యాణం కోసం ఆలయంలో తలంబ్రాల తయారీని ప్రారంభించారు. ముందుగా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి టీటీడీ జేఈవో వీరబ్రహ్మం తలంబ్రాలను డిప్యూటీ ఈవో రమణ ప్రసాద్ కు అందజేశారు. సీతారాముల కల్యాణం తిలకించేందుకు వచ్చిన భక్తులకు తలంబ్రాలు, ముత్యం, కంకణం పంపిణీ చేస్తారు. దాదాపు 300 మంది శ్రీవారి సేవకులతో రెండు లక్షల తలంబ్రాల ప్యాకెట్లను సిద్ధం చేస్తున్నది టిటిడి.
previous post