ఉమ్మడి కడప జిల్లా ఒంటిమిట్ట శ్రీ కోదండ రామస్వామి నవమి బ్రహ్మోత్సవాలల్లో భాగంగా స్వామి వారు పగటి ఉత్సవాలల్లో భాగంగా ఉదయం వేణుగాణాలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. ఈ సందర్భంగా జరిగిన నగరోత్సవం లో వివిధ ప్రాంతాలకు చెందిన భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. కేరళ వాయిద్యాలు, మంగళ వాయిద్యాలు, కోలాటాలు నడుమ వేడుకగా కొనసాగింది. భక్తులు నారికేళం సమర్పించి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. పాల్గొన్న భక్తులకు టీటీడీ అధికారులు తగు ఏర్పాట్లు చేశారు.
previous post
next post