గిరిజన రిజర్వేషన్ లు పెంచాలనే డిమాండ్ కు కొల్లాపూర్ నియోజకవర్గ కాంగ్రెస్ నాయకుడు రంగినేని అభిలాష్ రావు సంఘీభావం తెలిపారు. ఈ మేరకు వనపర్తి జిల్లా కేంద్రంలో కలెక్టర్ ఆఫీసు ముందు చేపట్టిన నిరాహార దీక్ష శిబిరంలో ఆయన పాల్గొని డిమాండ్ కు మద్దతునిచ్చారు.
గిరిజన రిజర్వేషన్ 6 శాతం నుంచి 12 శాతానికి పెంచాలని గిరిజన విద్యార్థి సంఘం ఈ దీక్షను చేపట్టింది. ఈ సందర్భంగా రంగినేని అభిలాష్ రావు మాట్లాడుతూ తెలంగాణ ముఖ్యమంత్రి కేసిఆర్ గిరిజనులకు 12 శాతం రిజ్వేషన్ అమలు చేస్తానని, 3 ఎకరాల భూమి ఇస్తామని హామీల వర్షం కురిపించి నట్టేట ముంచాడని తెలియజేశారు.
రిజర్వేషన్ ఎవరు ప్రసాదించే బిక్ష కాదు….డా.బిఆర్.అంబేద్కర్ రాసిన రాజ్యాంగ హక్కు అని కాబట్టి గిరిజనుల హక్కుల పోరాటంకు కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు అండగా ఉంటుందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర, జిల్లా గిరిజన నాయకులు,కాంగ్రెస్ సీనియర్ నాయకులు మరియు ఇతర పార్టీల నాయకులు, తండావాసులు తదితరులు పాల్గొన్నారు.