వనపర్తి జిల్లా శాఖల వారీగా తమ శాఖల పరిధిలో ఉన్న అన్ని పెండింగ్ పనులను పూర్తి చేయాలని వనపర్తి జిల్లా కలెక్టర్ తేజస్ నంద లాల్ పవార్ అధికారులను ఆదేశించారు. తెలంగాణ ఎన్నికల నిర్వహణ తర్వాత సోమవారం ఉదయం వనపర్తిలోని ప్రజావాణి హాల్లో అదనపు కలెక్టర్ ఎస్ తిరుపతి రావు తో కలిసి ప్రజావాణి ఫిర్యాదులను కలెక్టర్ స్వీకరించారు. ఈ సందర్భంగా జిల్లా అధికారులతో మాట్లాడుతూ వనపర్తి నియోజకవర్గంలో ఎన్నికలను సజావుగా నిర్వహించడంలో కృషి చేసిన అధికారులందరని శుభాకాంక్షలు తెలిపారు.
ఎన్నికలు పూర్తి అయ్యాయని తిరిగిన పంచాయతీరాజ్, పార్లమెంట్ ఎన్నికలు వచ్చేవరకు ఆయా శాఖల్లో పెండింగ్ లో ఉన్న పనులన్నీ పూర్తి చేయాలని సూచించారు. ముఖ్యంగా ప్రజావాణి దరఖాస్తులు ఏమైనా ఉంటే వాటిని, కోర్టు కేసులు, బడ్జెట్ కు సంబంధించిన పనులు పరిష్కరించాలని సూచించారు. శాఖల్లో నిర్వహిస్తున్న ఫైళ్లు, రిజిష్టర్ లు ఇంకా కొత్తగా ఏమైనా రిజిస్టరు పెట్టెల్సిన వాటిపై సత్వర చర్యలు తీసుకోవాలని సూచించారు. శాఖాపరమైన పనుల్లో పునరంకితం కావాలని అదేసమయంలో పని నైపుణ్యత పెంచుకునే ప్రయత్నం చేయాలని తెలియజేశారు. ఈ రోజు ప్రజావాణిలో మొత్తం (10 ) ఫిర్యాదులు వచ్చాయి. అదనపు కలెక్టర్ ఎస్ తిరుపతి రావు, జిల్లా అధికారులు ప్రజావాణి కార్యక్రమంలో పాల్గొన్నారు.
పోలిశెట్టి బాలకృష్ణ, సీనియర్ విలేకరి, సత్యం న్యూస్ నెట్