సలేశ్వరం జాతరను ఘనంగా నిర్వహించేందుకు అధికారులు, ఆలయ కమిటీ సభ్యులు ఏర్పాట్లు చేస్తున్నారు. అమ్రాబాద్ రిజర్వ్ టైగర్ దట్టమైన అటవీ, లోయ ప్రాంతంలో ఈ పవిత్ర క్షేత్రం ఉంటుంది. సలేశ్వరం జాతర ఉత్సవాలు ఏప్రిల్ 3 నుండి 11 వరకు జరుగుతాయి. ఎలాంటి ఇబ్బందులు లేకుండా జాతర నిర్వహించేందుకు అధికారులు అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఉత్సవాలను ప్రారంభించడానికి ప్రభుత్వ విప్ గువ్వల బాలరాజు, నాగర్ కర్నూల్ కలెక్టర్ ఉదయ్ కుమార్, డీఎఫ్ఓ రోహిత్ గోపిడిలు రానున్నారు. వేసవికాలం దృష్ట్యా భక్తులకు తాగునీటి వసతులను, ఉత్సవాలు జరిగే రోజులలో నిత్యాన్న దానాలను ఏర్పాటు చేశామని కమిటీ సభ్యులు తెలిపారు.
previous post