మునుగోడు ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా అధికార టీఆర్ఎస్ పార్టీ శాసనసభ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డిని గెలిపించాలని టిఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టిన ప్రభుత్వ పథకాలను తెలుపుతూ చౌటుప్పల్ మండలం, పెద్ద కొండుర్, మసీద్ గూడెం, శేరిళ్ళ గ్రామాలకు చెందిన వారు వృత్తిరీత్యా హైదరాబాదు నగరంలో నివాసం ఉంటుండగా, సత్తుపల్లి శాసనసభ్యులు సండ్ర వెంకట వీరయ్య హైదరాబాదులోని పెద్ద అంబర్ పేటలో నివాసముంటున్న గ్రామస్థుల ఇండ్లకు స్వయంగా వెళ్ళి ఓట్లను అభ్యర్థించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ సారధ్యంలో సంక్షేమ ఫలాలు అందిస్తున్న టిఆర్ఎస్ పార్టీ అభ్యర్థికి కారు గుర్తుపై ఓటు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని అభ్యర్థించారు. ఈ కార్యక్రమంలో మసీదుగుడేం గ్రామ ఉప సర్పంచ్ చిర్క అంజిరెడ్డి, ఏఎంసీ డైరెక్టర్, మాజీ సర్పంచ్ సుమిత్రా జేజేరెడ్డి, గ్రామ శాఖ అధ్యక్షులు పాకా రమేష్ యాదవ్, ప్రధాన కార్యదర్శి కూసుకుంట్ల పృథ్వీరాజ్ రెడ్డి, రైతుబంధు జిల్లా డైరెక్టర్ ముప్పిడి శ్రీనివాస్ తదితరులు ఉన్నారు.
previous post
next post