రోడ్డు ప్రమాదంలో ఆకస్మికంగా మరణించిన గాదెల రత్న ప్రభాకర్ రెడ్డి అంతిమయాత్ర కొల్లాపూర్ లో ముగిసింది. కొల్లాపూర్ మాధవ స్వామి ఆలయం సమీపం నుండి పురవిధుల గుండా అంతిమయాత్ర కొనసాగింది. అనంతరం ఆయన భౌతిక కాయాన్ని ఆయన స్వగ్రామం అయిన మాచినేని పల్లి కి తరలించారు.
టిఆర్ఎస్ జిల్లా నాయకులు కొల్లాపూర్ నియోజకవర్గ ముఖ్య నాయకులు కార్యకర్తలు ప్రజలు వేలాదిగా తరలివచ్చారు. మాజీమంత్రి జూపల్లి కృష్ణారావు ఆయన పార్ధివ దేహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కొల్లాపూర్ లోజరిగిన అంతిమయాత్రలో జూపల్లి తోపాటు అనుచరవర్గం పాల్గొన్నారు.
ఎమ్మెల్యే బీరం హర్షవర్థన్ రెడ్డి అనుచరవర్గం అంతిమయాత్ర కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి, మామిళ్ల పల్లి విష్ణువర్ధన్ రెడ్డి, నియోజకవర్గ నాయకులు దూ రెడ్డి రఘు వర్ధన్ రెడ్డి రత్న ప్రభాకర్ రెడ్డి అంతిమయాత్రలో పాల్గొన్నారు. ఎమ్మెల్యే వర్గం కన్నీటి పర్యంతం అయ్యారు.