వెనుకబడి ఉన్న నాగర్ కర్నూల్ జిల్లా కొల్లాపూర్ కు తక్షణమే పాలిటెక్నిక్ కాలేజీ మంజూరు చేయాలని కొల్లాపూర్ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి కోరారు. ఆ మేరకు ఆయన నేడు తెలంగాణా రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డిని కలిసి వినతి పత్రం సమర్పించారు. వెనుకబడిన ప్రాంతమైన కొల్లాపూర్ నియోజకవర్గంలోని పేద ప్రజలు విద్య కోసం సుదూర ప్రాంతాలకు వెళ్లాల్సి వస్తున్నదని ఆయన అన్నారు. అలా వెళ్లకుండా విద్యలో ముందుకు పోవడానికి కొల్లాపూర్ పట్టణానికి పాలిటెక్నీక్ కాలేజి మంజూరు చేయాలని కోరారు. ఈరోజు హైద్రాబాద్ లోని విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రరెడ్డిని కలిసినవారిలోచంద్రశేఖర్ నాయక్, కురుమయ్య,సాయి బాబు తదితరులు కూడా ఉన్నారు.
previous post