38.2 C
Hyderabad
May 3, 2024 20: 21 PM
Slider మహబూబ్ నగర్

కొల్లాపూర్ ఎమ్మెల్యే హర్షవర్ధన్ రెడ్డి ఆపన్న హస్తం

kollapur MLA

లాక్ డౌన్ తో పేద ప్రజలు పడుతున్న ఇబ్బందిని కొంతైనా దూరం చేయడానికి కొల్లాపూర్ ఎమ్మెల్యే బీరం హర్ష వర్ధన్ రెడ్డి నడుం బిగించారు. గత కొద్ది రోజులుగా పేద ప్రజలకు ఆయన నిత్యావసరాలు పంపిణీ చేస్తున్నారు. నేడు కొల్లాపూర్ నియోజకవర్గం లోని వెన్నచెర్ల గ్రామం లో 20 మంది నిరుపేదలకు సోనమసూరి బియ్యం, గోధుమపిండి, కందిపప్పు, నూనె, చింతపండు తదితర సరుకులు) అందచేశారు.

ఈ సందర్బంగా మండల తెరాస పార్టీ జనరల్ సెక్రటరీ పవన్ కుమార్ శర్మ, బీరం రాజారెడ్డి మాట్లాడుతూ లాక్ డౌన్ మూలంగా పేద కుటుంబాలు ఆర్థిక ఇబ్బందులు పడుతున్నాయని అలాంటి వారికి ప్రభుత్వం చేయూతనిస్తుందని తెలిపారు.

ప్రభుత్వం చేసిన సాయానికి తోడుగా ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి ప్రతినిత్యం ప్రజల వెంటే ఉంటూ ఆ సాయం అందని వారికి ఆయన సొంత డబ్బుతో నిత్యావసరాలు అందచేస్తున్నారు. ప్రజలు అధైర్య పడకుండా సంయమనంతో మెలిగి స్వీయ నిర్బంధాన్ని పాటించాలని ఈ సందర్భంగా వారు సూచించారు.

లబ్ధిదారులు ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి కి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో PACS డైరెక్టర్ రాళ్లపల్లి కృష్ణ శర్మ (అయ్యగారు) చిర్ర సుబ్బారెడ్డి, సుధాకర్ రెడ్డి, వొడ్ల కొండయ్య, మన్నే శేఖర్ రెడ్డి, సాంబ శివుడు, కరుణాకర్ రెడ్డి, మన్నేవెంకటరెడ్డి, మహేష్ చారి, లింగం తదితరులు పాల్గొన్నారు.

Related posts

సమంత వెరీ డెడికేటెడ్ & హార్డ్ వర్కింగ్ యాక్ట్రెస్!

Satyam NEWS

డిసెంబరు 6న 7వ విడ‌త‌ సుందరకాండ అఖండ పారాయ‌ణం

Satyam NEWS

కాల తరువు

Satyam NEWS

Leave a Comment