35.2 C
Hyderabad
April 30, 2024 23: 48 PM
తెలంగాణ

కొల్లాపూర్ ఆర్టీసీ డిపో కార్మికులకు సిఐ బి.వెంకట్ రెడ్డి విజ్ఞప్తి

kolla police

గత ముప్పై రెండు రోజుల నుంచి ఆర్టీసీ కార్మికులు సమ్మె చేస్తున్న సంగతి అందరికి తెలిసిందే. ఆర్టీసీ కార్మికులకు రాష్ట్ర ప్రభుత్వం 5వ తేదీ అర్ధరాత్రి వరకు డెడ్ లైన్ విధించిన సంగతి కూడా తెలిసిందే. అయితే మంగళవారం నాటికి డెడ్ లైన్  ముగుస్తున్న సమయంలో పోలీస్ శాఖ ఆదేశాల మేరకు కొల్లాపూర్ సిఐ బి.వెంకట్ రెడ్డి ఆర్టీసీ కార్మికులకు ఈ విజ్ఞప్తి చేస్తున్నారు. సమ్మె విరమించాలనుకునే ఆర్టీసీ కార్మికులు సిఐ కార్యాలయానికి రావచ్చునని ఆయన కోరారు. ఈ మేరకు మంగళవారం ఉదయం పోలీస్ స్టేషన్ గేటు కు ఈ బోర్డు తగిలించారు. ప్రభుత్వం ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకునే వారు విధుల్లో చేరడానికి సీఐ కార్యాలయాన్ని ఆశ్రయించ వచ్చన్నారు. విధుల్లో చేరేవారు ఎవరి నుండి ఇబ్బందులకు గురికాకుండా నేరుగా కొల్లాపూర్ సర్కిల్ ఇన్ స్పెక్టర్ కార్యాలయంలో దరఖాస్తును అర్ధరాత్రి వరకు అందిచవచ్చని సిఐ తెలియచేస్తున్నారు. ప్రభుత్వం ఇచ్చిన అవకాశాన్ని కొల్లాపూర్ ఆర్టీసీ కార్మికులు సద్వినియోగం చేసుకోవాలని సిఐ వెంకట్ రెడ్డి పేర్కొంటున్నారు.

Related posts

కుక్క చచ్చిపోతే కేసుపెట్టారు మరి డెంగ్యూతో చనిపోతే

Satyam NEWS

రైతుల భార‌త్ బంద్‌కు టీఆర్ఎస్ పూర్తి మ‌ద్ధ‌తు

Sub Editor

జర్నలిస్టు కుటుంబాలకు ఉచిత వైద్యం

Satyam NEWS

Leave a Comment