జగిత్యాల జిల్లా కోరుట్ల డిపోకు చెందిన ఆర్టీసీ కండక్టర్ శ్రీనివాస్ రెడ్డి (40) సోమవారం సాయంత్రం పెద్దపల్లి బస్ స్టాండ్ లో గుండె పోటుతో మృతి చెందారు. కోరుట్ల డిపోకు చెందిన శ్రీనివాస్ రెడ్డికి ఆర్టీసీ అధికారులు మేడారం జాతర విధులు కేటాయించారు. మేడారం నుండి పెద్దపల్లి వచ్చిన అనంతరం శ్రీనివాస్ రెడ్డి గుండెపోటుతో కుప్ప కూలిపోయారు. దీనితో కండక్టర్ అక్కడికక్కడే చనిపోయాడు.మృత దేహాన్ని జగిత్యాల జిల్లాకు తరలించారు.
previous post