ఎగువ ప్రాంతాలలో కురుస్తున్న వర్షాలలో కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గ వరప్రదాయిని అయినా కౌలాస్నాలా ప్రాజెక్టు నిండుకుండను తలపిస్తోంది.
కౌలాస్ నాల ప్రాజెక్ట్ దాదాపుగా పూర్తి స్థాయి నీటి మట్టానికి చేరుకున్నది. దాంతో గేట్ల ద్వారా వరద నీరు దిగువనకు వదులుతున్నారు.
ఇందు మూలంగా కౌలాస్ వాగు, మంజీర ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కౌలాస్ ప్రాజెక్ట్ డిఇ దత్తాత్రేయ కోరారు. ముఖ్యంగా జుక్కల్, పెద్ద కొడపగల్, బిచ్కుంద, బీర్కూర్, కోటగిరి, బోధన్, రెంజల్, కందకుర్తి, మండలాలకు చెందిన ప్రజలు అప్రమతంగా ఉండాలని ఆయన విజ్ఞప్తి చేశారు.
జీ లాలయ్య, జుక్కల్, సత్యం న్యూస్ రిపోర్టర్