అనంతపురం జిల్లా చెన్నే కొత్తపల్లి మండలం కనుముక్కల గ్రామం నందు ఉన్న శ్రీ గుమ్మనాధేశ్వర ప్రాచీన శివాలయంలో కార్తీక సోమవారం సందర్భంగా మహాన్యాస, పూర్వక ఏకాదశివారా,రుద్రాభిషేక, శివార్చన, శ్రీ గణపతి హోమం, నవగ్రహ హోమం,రుద్ర హోమం, పూర్ణాహుతి, మహా మంగళహారతి,పూజా కార్యక్రమం జరిగింది.
ధర్మవరం ఆర్టీసీ గౌరవ అధ్యక్షులు డోలా రాజారెడ్డి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిపించి అనంతరం అన్నదాన కార్యక్రమం చేశారు ఈ హోమంలో డోలా వారి కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రాప్తాడు ఎమ్మెల్యే ప్రకాష్ రెడ్డి పూజా కార్యక్రమంలో పాల్గొని అనంతరం మీడియాతో మాట్లాడుతూ, కార్తీక సోమవారం సందర్భంగా ఈ పర్వదినాన ఈరోజు కనుముక్కల గ్రామం నందు హోమం నిర్వహించడం జరిగింది.
అలాగే అన్నదాన కార్యక్రమం ఇవన్నీ కూడా డోలా రాజారెడ్డి ఆధ్వర్యంలో భక్తాదులు అందరూ కూడా పాల్గొని చుట్టుపక్కల గ్రామ ప్రజలు స్వామి వారి భక్తులు అందరూ కూడా పాల్గొనడం జరిగింది అన్నారు. ఈ పర్వదినాన జరిగే కార్యక్రమంలో తప్పనిసరిగా అందరూ ఈరోజు ఇక్కడ పాల్గొన్న వారందరికీ శుభం కలుగుతుందని వేద పండితులు తెలిపారు అని అన్నారు.
సత్యం న్యూస్. అనంతపురం జిల్లా