బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి అనగారిన వర్గాల అభివృద్ధి పై పోరాడిన మాన్య జ్యోతిరావు పూలే జయంతి అంబర్ పేట్ లో ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా అలీ కేఫ్ ఎక్స్ రోడ్ లో ఉన్న జ్యోతిరావు పూలే విగ్రహానికి మాజీ మంత్రి సి.కృష్ణ యాదవ్ పూలమాలవేసి జయంతి ఉత్సవాల్లో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా కృష్ణ మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాల కోసం నిరంతరం కృషి చేసిన మాన్యశ్రీ జ్యోతిరావు పూలే ఆశయాలను కొనసాగించాల్సిన అవసరం ఉందని అన్నారు. ఈ కార్యక్రమంలో కృష్ణ యాదవ్ యువసేన నాయకులు తూర్పు రాంచందర్ ముదిరాజ్, కుంకుమ నరేందర్, రాజు, గుప్తా, సునీల్ యాదవ్, సోనూ భాయ్, మాజర్ బాయ్, గణేష్ ముదిరాజ్, మేడ్చల్ రాజు, దాడిగే జగన్ యాదవ్, వేణు, శ్రీనివాస్, తదితరలు పాల్గొన్నారు.
సత్యం న్యూస్, అంబర్పేట