42.2 C
Hyderabad
April 26, 2024 15: 15 PM
Slider ప్రత్యేకం

విజయనగరం జడ్పీ చైర్మన్ శ్రీను నివాసంలో డిప్యూటీ స్పీకర్ కోలగట్ల

#kolagatla

ఇరువురు నేతలు మర్యాదపూర్వకంగా భేటీ

విజయనగరం ఎమ్మెల్యే కోలగట్ల వీరభద్ర స్వామి కి సీఎం జగన్.. డిప్యూటీ స్పీకర్ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో జడ్పీ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు  డిప్యూటీ స్పీకర్ కోలగట్ల వీరభద్రస్వామి  తన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. డిప్యూటీ స్పీకర్ గా విజయనగరం ఎమ్మెల్యే  కోలగట్ల వీరభద్రస్వామి నియమితులైన నేపధ్యంలో గౌరవ మజ్జి శ్రీనివాసరావు గారితో ఈ మర్యాదపూర్వక భేటీ జరిగింది. ఇంటికి చేరుకున్న  కోలగట్ల వీరభద్రస్వామికి చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు పుప్పాంజలి దంపతులు… సాదర స్వాగతం పలికారు.

అనంతరం  జెడ్పీ చైర్మన్, డిప్యూటీ స్పీకర్ ఇద్దరూ పలు అంశాలపై కాసేపు చర్చించుకున్నారు.. ఇద్దరు నేతలు కలిసి తేనేటి విందులో పాల్గొన్నారు. అనంతరం వీరభద్రస్వామిని దుశ్శాలువాతో ఘనంగా సన్మానించారు.. ఆత్మీయ అనురాగాల నడుమ చైర్మన్ గారి కుటుంబ సభ్యులంతా వీరభద్రస్వామి శుభాకాంక్షలు తెలియజేశారు.మర్యాదల నడుమ చిన్న శ్రీను కుమారుడు మోహిత్…కుమార్తె సిరి సహస్రలు వీరభద్రస్వామికి శుభాకాంక్షలు తెలియజేశారు…

Related posts

మరో పోరాటానికి సిద్ధం కావాలని తీన్మార్ మల్లన్న పిలుపు

Satyam NEWS

ప్రజా గాయకుడు గద్దర్ నటించిన చివరి చిత్రం ఉక్కు సత్యాగ్రహం

Satyam NEWS

ఏ ఎస్ రావు నగర్ లో ఘనంగా నారా చంద్రబాబు నాయుడు జన్మదిన వేడుకలు

Satyam NEWS

Leave a Comment