వరంగల్లో మరో ఐటీ డెవలప్మెంట్ సెంటర్ను ఏర్పాటు చేయనున్నట్లు ఇవాళ రాష్ట్ర ఐటీ మంత్రి కేటీఆర్ ట్విట్టర్లో వెల్లడించారు. ఈ సందర్భంగా ఆయన “ఈ నెల 16న ‘క్వాడ్రంట్ రిసోర్స్’ కంపెనీ వరంగల్లో సెంటర్ ఏర్పాటుకు శంకుస్థాపన చేయబోతుంది. 1.5 ఎకరాల్లో ఉండబోయే ఈ కంపెనీలో 500 మంది స్థానిక యువతకు ఉద్యోగాలు దొరకనున్నాయి” అని ట్వీట్ చేశారు. అలాగే కేటీఆర్ ఈ కంపెనీ ఫౌండర్ వంశీరెడ్డికి ధన్యవాదాలు తెలిపారు.
previous post