28.7 C
Hyderabad
May 6, 2024 00: 48 AM
Slider ముఖ్యంశాలు

అమెరికాకు వెళ్లిన మంత్రి కేటీఆర్

#ministerktr

తెలంగాణ రాష్ట్రానికి మరిన్ని పెట్టుబడులు తీసుకువచ్చే ప్రయత్నంలో భాగంగా ఐటి, పరిశ్రమల శాఖ మంత్రి కే తారకరామారావు, ఉన్నతాధికారుల బృందం అమెరికా పర్యటనకు వెళ్లింది.. ఈరోజు ఉదయం కేటీఆర్ అమెరికాలోని లాస్ ఏంజిల్స్, శాన్ డియాగో, సానో హోజే, బోస్టన్, న్యూయార్క్ వంటి నగరాల్లో పర్యటించి అనేక కంపెనీల అధిపతులు, సీనియర్ ప్రతినిధి బృందాలతో సమావేశమవుతారు.

 వారం రోజులకు పైగా కొనసాగనున్న ఈ పర్యటనలో ప్రపంచంలోని అత్యంత ప్రతిష్ఠాత్మకమైన పలు ఐటి, ఎలక్ట్రానిక్స్ ఫుడ్ ప్రాసెసింగ్, లైఫ్ సైన్సెస్, ఫార్మా రంగాల కంపెనీలతో సమావేశమవుతారు. గతంలో అమెరికాలో పర్యటించి పెద్దఎత్తున పెట్టుబడులను తెలంగాణకు తీసుకువచ్చిన కేటీఆర్ ఈ పర్యటన ద్వారా మరిన్ని పెట్టుబడులను తెలంగాణకు తీసుకు వచ్చే అవకాశం ఉన్నది. మంత్రి కేటీఆర్ తో పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి జయేష్ రంజన్, పరిశ్రమలు ఐటీ శాఖకు చెందిన పలు విభాగాల డైరెక్టర్లు ఈ పర్యటనలో ఉన్నారు.

Related posts

కాలచక్రం

Satyam NEWS

ప్రజా చైతన్యమే లక్ష్యంగా ప్రజాపోరు యాత్ర

Bhavani

ఫ్లోరైడ్ బాధితుడు అంశాల స్వామికి నెరవేరిన కల

Satyam NEWS

Leave a Comment