నంద్యాల జిల్లా శ్రీశైలం క్షేత్రంలో మంగళవారం లోకకల్యాణార్థం శ్రీ భ్రమరాంబ దేవికి ఉత్సవం నిర్వహించనున్నారు.
ప్రతి సంవత్సరం చైత్ర మాసం లో పౌర్ణమి తర్వాత వచ్చే మంగళవారం లేదా శుక్రవారాల్లో అమ్మవారికి కుంభోత్సవం నిర్వహించడం ఆనవాయితీ.
ఈ ఉత్సవంలో భాగంగా అమ్మవారికి గుమ్మడి కాయలు నిమ్మకాయలు సాత్విక బలి గా సమర్పిస్తారు అలాగే కుంభహారతి మరియు అమ్మవారికి పలురకాల వంటలతో మహానివేదన సమర్పిస్తారు.
దేవాదాయ చట్టం ప్రకారం క్షేత్ర పరిధిలో జంతువులు పక్షులు బలులును పూర్తిగా నిషేధించారు ఆలయ సిబ్బంది స్థానిక రెవెన్యూ పోలీసు శాఖల సహకారంతో జంతు పక్షి పనులు జరగకుండా పర్యవేక్షించాలని ఈవో లవన్న ఆదేశించారు.
అమ్మవారి ఆలయంలోని అన్ని ఆర్జిత సేవలను, స్వామివారి కల్యాణోత్సవం ,ఏకాంత సేవ నిలుపుదల చేస్తారు.