39.2 C
Hyderabad
April 28, 2024 14: 27 PM
Slider కర్నూలు

ఆళ్లగడ్డ రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మృతి

#RoadAccident

నంద్యాల జిల్లా ఆళ్ళగడ్డ మండలంలో అర్ధరాత్రి జాతీయ రహదారిపై ఘోర రోడ్డుప్రమాదం జరిగింది. స్కార్పియో కల్వర్టును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందగా.. మరో ముగ్గురికి గాయాలు అయ్యాయి. అందులో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. క్షతగాత్రులను స్థానికులు దగ్గర్లో ఉన్న నంద్యాల ఆస్పత్రికి తరలించారు. మద్దిలేటి స్వామి దర్శనానికి వెళ్లి వస్తుండగా ఘటన చోటు చేసుకుంది. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు. అనంతరం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతులు కడప జిల్లా మైదుకురు వాసులుగా పోలీసులు గుర్తించారు. మృతులు వెంకటేశ్వర్లు, స్వరాజ్యం, విజయలక్ష్మిగా పోలీసులు గుర్తించారు.

Related posts

విద్యార్థుల పై లాఠీ ఛార్జ్ చేయడం దుర్మార్గం

Satyam NEWS

బౌద్ధుల పవిత్ర స్థలంలో సినిమా క్లబ్ ఏర్పాటు చేస్తారా?

Satyam NEWS

దేశాన్ని విచ్చిన్నం చేసే బీజేపీ కుట్రలను ఎండగట్టాలి

Bhavani

Leave a Comment