నంద్యాల జిల్లా ఆళ్ళగడ్డ మండలంలో అర్ధరాత్రి జాతీయ రహదారిపై ఘోర రోడ్డుప్రమాదం జరిగింది. స్కార్పియో కల్వర్టును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందగా.. మరో ముగ్గురికి గాయాలు అయ్యాయి. అందులో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. క్షతగాత్రులను స్థానికులు దగ్గర్లో ఉన్న నంద్యాల ఆస్పత్రికి తరలించారు. మద్దిలేటి స్వామి దర్శనానికి వెళ్లి వస్తుండగా ఘటన చోటు చేసుకుంది. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు. అనంతరం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతులు కడప జిల్లా మైదుకురు వాసులుగా పోలీసులు గుర్తించారు. మృతులు వెంకటేశ్వర్లు, స్వరాజ్యం, విజయలక్ష్మిగా పోలీసులు గుర్తించారు.
previous post
next post