హైదరాబాద్ చిక్కడపల్లిలోని శ్రీ త్యాగరాయ గానసభ లో కురుగంటి కళాక్షేత్రం 25వ వార్షికోత్సవ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి రాష్ట్ర BC కమిషన్ చైర్మన్ వకుళభరణం కృష్ణమోహన్ రావు, రాష్ట్ర పర్యాటక అభివృద్ధి సంస్థ చైర్మన్ ఉప్పల శ్రీనివాస్ గుప్త ముఖ్య అతిధులుగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా శ్రీనివాస్ గుప్త మాట్లాడుతూ కేసీఆర్ సీఎం అయిన తర్వాత కళారంగానికి ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తున్నారని తెలిపారు. చిత్ర రంగానికి అన్ని విధాలుగా ప్రోత్సాహకాలు, సహాయ సహకారాలు అందిస్తున్న ప్రభుత్వం కేసీఆర్ ప్రభుత్వం అని శ్రీనివాస్ గుప్త అన్నారు. అంతకు ముందున్న ప్రభుత్వాలు కళారంగాన్ని పట్టించుకున్న దాఖలాలు లేవని ఆయన తెలిపారు. కేసీఆర్ సీఎం అయిన తర్వాత మంత్రి వి. శ్రీనివాస్ గౌడ్ ఆధ్వర్యంలో కళారంగానికి ప్రత్యేకంగా అభివృద్ధికి కృషి చేస్తున్నారని ఆయన తెలిపారు.