కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో ప్రజా సమస్యలు తెలుసుకొని వారికి భరోసా ఇవ్వడానికే ‘కుత్బుల్లాపూర్ గోస – శ్రీశైలం అన్న భరోసా’ కార్యక్రమాన్ని చేపట్టానని మాజీ ఎమ్మెల్యే, బీజేపీ నేత కూన శ్రీశైలం గౌడ్ తెలిపారు. ఇందులో భాగంగా ఈరోజు జీడిమెట్ల 132 డివిజన్ పరిధిలోని అయోద్య నగర్ లో పాదయాత్ర చేపట్టారు.
పాదయాత్ర లో మాజీ ఎమ్మెల్యే కు బస్తీవాసులు అనేక వినతులు, సమస్యలు ఆయన దృష్టికి తీసుకొచ్చారు. వాటి పరిష్కారం కోసం కృషి చేస్తానని ఆయన హామీఇచ్చారు. ఈ సందర్బంగా బీజేపి నేతలు ఇంటింటికి తిరుగుతూ బీఆర్ఎస్ పార్టీ, స్థానిక ఎమ్మెల్యే ప్రజావ్యతిరేక విధానాల గురించి కరపత్రాలను పంచారు.
అంతకుముందు అయోధ్యనగర్లో భాజపా జెండాను మాజీ ఎమ్మెల్యే ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో డివిజన్ బీజేపీ నేతలు నటరాజ్ గౌడ్, నల్లా జయశంకర్ గౌడ్, బాలప్ప, నర్సింగరావు, కనుకయ్య గౌడ్, అంజయ్య, అలివేలు, మనీష్, కృష్ణవేణి, సిద్దిరాములు, బవర్ లాల్, నాగమ్మ, దమయంతి, శోభా, బస్తీ నాయకులు, విశ్వకర్మ సంఘం నాయకులు, ప్రజలు తదితరులు పాల్గొన్నారు