ఏలూరు జిల్లా పెదవేగి మండలం నడిపల్లి గ్రామం లో గురువారం సాయంత్రం దెందులూరు ఎం ఎల్ ఏ కొటారు అబ్బయ్యచౌదరి నిర్వహించిన గడప గడపకు మన ప్రభుత్వం పాదయాత్ర లో ప్రజలు అడుగడుగునా ఘనస్వాగతం పలికారు. గడప గడపలో మహిళలు పెద్ద ఎత్తున హారతులు పట్టారు. పాదయాత్రలో ఎం ఎల్ ఏ అబ్బయ్యచౌదరి కి తోడుగా ఊరంతా కదిలింది. నడిపల్లి రహదారులన్నీ కొటారు సైన్యం తో కిక్కిరిసిపోయాయి. అబ్బయ్యచౌదరి పాదాలు ప్రతి గడను తాకాయి. గడప గడపలో ఎం ఎల్ ఏ ను ప్రజలు ఆప్యాయతలతో ముంచెత్తారు. ప్రతి గడప కు జగనన్న ప్రభుత్వం మంజూరు చేసిన పథకాలు చేరాయా అంటూ అబ్బయ్య ఆరా తీశారు. నడిపల్లి గ్రామం లో చేపట్టిన అభివృద్ధి పనులు, మంజూరు చేసిన ఇళ్లస్థలాలు, నిర్మించిన గృహాలు, అమ్మ వడి, జగనన్న ఆసరా, రైతు భరోసా, జగనన్న విద్యా దీవెన, జగనన్న వసతి దీవెన, వృద్ధులకు, వితంతువులకు, ఒంటరి మహిళలకు, చేతి వృత్తి దారులకు సంక్షేమ పథకాలు అందాయా అంటూ ఆరాతీస్తూ, అందని గృహాలను గుర్తించండి అంటూ అధికారులకు ఆదేశాలిస్తూ ముందుకు సాగారు. ఉప్పొంగిన ఉత్సాహం తో పాల్గొన్న గ్రామస్తుల నడుమ నడిపల్లి పాదయాత్ర లో అధికారులు, సచివాలయ సిబ్బంది, ప్రజాప్రతినిధుల నడుమ నవ్వుతూ నడిచారు.
previous post