38.2 C
Hyderabad
April 29, 2024 20: 01 PM
Slider పశ్చిమగోదావరి

పాదయాత్రలో ఉత్సాహంగా పాల్గొన్న గ్రామస్థులు

#abbaiahchowdary

ఏలూరు జిల్లా పెదవేగి మండలం  నడిపల్లి గ్రామం లో గురువారం సాయంత్రం దెందులూరు ఎం ఎల్ ఏ కొటారు అబ్బయ్యచౌదరి నిర్వహించిన గడప గడపకు మన ప్రభుత్వం పాదయాత్ర లో ప్రజలు అడుగడుగునా ఘనస్వాగతం  పలికారు. గడప గడపలో మహిళలు పెద్ద ఎత్తున హారతులు పట్టారు. పాదయాత్రలో ఎం ఎల్ ఏ అబ్బయ్యచౌదరి కి తోడుగా  ఊరంతా కదిలింది. నడిపల్లి రహదారులన్నీ కొటారు సైన్యం తో కిక్కిరిసిపోయాయి. అబ్బయ్యచౌదరి పాదాలు ప్రతి గడను తాకాయి. గడప గడపలో ఎం ఎల్ ఏ ను ప్రజలు ఆప్యాయతలతో ముంచెత్తారు. ప్రతి గడప కు జగనన్న ప్రభుత్వం మంజూరు చేసిన పథకాలు చేరాయా అంటూ అబ్బయ్య ఆరా తీశారు. నడిపల్లి గ్రామం లో చేపట్టిన అభివృద్ధి పనులు, మంజూరు చేసిన ఇళ్లస్థలాలు, నిర్మించిన గృహాలు, అమ్మ వడి, జగనన్న ఆసరా, రైతు భరోసా, జగనన్న విద్యా దీవెన, జగనన్న వసతి దీవెన, వృద్ధులకు, వితంతువులకు, ఒంటరి మహిళలకు, చేతి వృత్తి దారులకు సంక్షేమ పథకాలు అందాయా అంటూ ఆరాతీస్తూ, అందని గృహాలను గుర్తించండి అంటూ అధికారులకు ఆదేశాలిస్తూ ముందుకు సాగారు. ఉప్పొంగిన ఉత్సాహం తో పాల్గొన్న గ్రామస్తుల నడుమ నడిపల్లి  పాదయాత్ర  లో అధికారులు, సచివాలయ సిబ్బంది, ప్రజాప్రతినిధుల నడుమ నవ్వుతూ నడిచారు.

Related posts

విజ‌య‌న‌గ‌రం గంట స్తంభం సాక్షిగా మండుటెండ‌లో సర్పంచుల బిక్షాటన

Satyam NEWS

రష్యా సబ్‌మెరైన్‌ ఇంజినీర్‌ విశాఖలో మృతి

Satyam NEWS

శ్రీ పద్మావతి అమ్మవారి బ్ర‌హ్మోత్స‌వాల‌కు రేపు అంకురార్ప‌ణ‌

Satyam NEWS

Leave a Comment