కేంద్రం మెడలు వంచుతానని చెప్పి, డిల్లీ వెళ్ళి నప్పుడు అల్లా మన ముఖ్యమంత్రి దించిన మెడ ఎత్తడం లేదని తెలుగుదేశం పార్టీ శాసనసభ్యుడు గంటా శ్రీనివాసరావు అన్నారు. ఆయన నేడు మహానాడు పోస్టర్ ఆవిష్కరణ సభలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా అధికారం చేపట్టి నాలుగు సంవత్సరాలు అయింది అనేక అభివృద్ధి చేశాం అని వైసీపీ నేత లు చెప్పారు.
అన్ని చేస్తాం అని చెప్పి అధికారం లోకి వచ్చి ఇప్పటి వరకు ఏమి చేయలేదు. ప్రత్యేక హోదా, పోలవరం, విశాఖ రైల్వే జోన్ అన్ని ప్రక్కన పెట్టి నవరత్నాలు అని తెరపైకి తెచ్చారు అని ఆయన అన్నారు. విభజన హామీ లపై ప్రతి పక్షం లో వుండగా ఎంపీ లను రాజీనామా చేయించి, టీడీపీ కేంద్రం తో ములాఖాత్ అంటూ చెప్పి అధికారం లోకి వచ్చి ఆ తర్వాత జగన్ ఏమీ చేయలేదని ఆయన అన్నారు. ఇప్పుడు డిల్లీ ఎందుకు వెళ్ళుతున్నారు అనే విషయం అందరికి తెలుసు.
రైల్వే జోన్ ఊసెత్తలేదు. పోలవరం ఒక సంవత్సరం లో పూర్తి చేస్తాం అని చెప్పి ఒక్క శాతం కూడా ముందు కు పోలేదు.మంత్రులు మారుతున్నారు తప్ప పని జరగడం లేదు అని ఆయన విమర్శించారు. సీపీయస్ పేరుతో ఉద్యోగులను మోసం చేశారని ఆయన అన్నారు. సంపూర్ణ మద్యపాన నిషేధం పై మాట తప్పారు.కల్తీ సారా,జే బ్రాండ్ మద్యం ద్వారా వేల కోట్ల రూపాయలు సంపాదనకు జగన్ అలవాటు పడ్డారని ఆయన ఆరోపించారు.
కల్తీ మద్యం తాగి 81 మంది ప్రాణాలు కోల్పోయారు. అమరావతి ని మార్చేసి మూడు రాజధానులు గా చేశారు. ఈ ఎన్నికలు సంవత్సరం లో హడావిడి గా భోగాపురం ఎయిర్ పోర్ట్,మూలపేట పోర్ట్, అధానీ డేటా సెంటర్ అంట.ఇవన్నీ గతం లో టీడీపీ హయాంలో చేసిన వాటికి తూతూ మంత్రంగా శంకుస్థాపన లు చేశారని అన్నారు. అమరావతి కి భూములు ఇచ్చిన రైతు లు నిరాహార దీక్ష లు చేస్తుంటే పట్టించు కోవడం లేదు. విశాఖ లో భూములు కబ్జా అవుతున్నాయని ఆయన తెలిపారు.