35.2 C
Hyderabad
May 9, 2024 16: 11 PM
Slider రంగారెడ్డి

సీఐ, రెవెన్యూ అధికారుల పై భూ కబ్జాదారుల దాడి

#Attack on Police

మేడ్చల్ జిల్లా కాప్రా మండలం జవహర్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో దారుణం జరిగింది. భూ కబ్జాదారులు రెచ్చిపోయారు. వివరాలలోకి వెళితే మేడ్చల్ జిల్లా కలెక్టర్ వాసం వెంకటేశ్వర్లు సంవత్సరం క్రితం, జవహర్ నగర్ ప్రధాన రహదారి లో, సర్వేనెంబర్ 432 గజాల స్థలం పబ్లిక్ టాయిలెట్స్ కోసం కేటాయించారు.

దానిలో కొంతమంది భూ కబ్జాదారులు నిర్మాణాలు చేపట్టడంతో,  స్థలంలో నిర్మాణాలను తొలగించేందుకు కమిషనర్ నేతి  మంగమ్మ, తాసిల్దార్ కె గౌతమ్ కుమార్ వారి సిబ్బందితో కలిసి వెళ్లారు. వారికి రక్షణగా జవహర్ నగర్, సి ఐ, పి.  బిక్షపతి రావు ఆధ్వర్యంలో పోలీసు బలగాలతో వెళ్లగా, భూ కబ్జాదారులతో  కలిసి కొంతమంది బీజేపీ నాయకులు, తెరాస నాయకులు కలిసి సిఐ బిక్షపతి రావు పై పెట్రోల్ పోసి నిప్పంటించారు.

దీంతో కాలిన గాయాలతో హుటాహుటిన దగ్గరలోని దమ్మాయిగూడ ఆదిత్య ఆసుపత్రిలో ఆయన్ను చేర్పించారు. వెంటనే ఆస్పత్రికి చేరుకున్న హైదరాబాద్ సీపీ మహేష్ భగవత్, ఏ సి పి. శివ కుమార్ వెంటనే సికింద్రాబాద్ లోని యశోద ఆసుపత్రికి ఆయనను మంచి చికిత్స కోసం తరలించారు.

సిఐ బిక్షపతి రావు పై పెట్రోల్ దాడి అనంతరం, విధులు నిర్వహిస్తున్న మున్సిపల్ కమిషనర్, నేతి మంగమ్మ పై, కాప్రా తాసిల్దార్ కె. గౌతమ్ కుమార్ పై కూడా దాడికి యత్నించగా రెవెన్యూ సిబ్బంది, మున్సిపల్ సిబ్బంది, పోలీసులు కలిసి వారిని దుండగుల బారి నుండి రక్షించారు.

Related posts

మంత్రి బొత్స నివాసంలో కొత్త ఏడాది వేడుకలు..!

Satyam NEWS

ఆటో బోల్తా ఐదుగురికి తీవ్ర గాయాలు

Satyam NEWS

రుణాలపై క్లారిటీ ఇవ్వనున్న అదానీ గ్రూప్

Satyam NEWS

Leave a Comment