అన్నమయ్య జిల్లా లో అక్రమార్కులకు అడ్డులేకుండా పోతున్నది. అక్రమార్కులు భారీ ఎత్తున భూ ఆక్రమణలు చేస్తున్నా పట్టించుకునే నాథుడే లేకుండా పోయాడు. సుండుపల్లి మండలం జి.రెడ్డివారి పల్లె లో భారీగా భూ ఆక్రమణలు జరుగుతున్నా రెవెన్యూ యంత్రాంగం పట్టించుకోవడం లేదు. ఎర్రమనేని పాలెం గ్రామంలో 391 సర్వే నెంబర్ లో ఉన్న 50 ఎకరాల ప్రభుత్వ భూమి కబ్జా కు నీలంవాండ్ల పల్లె కు చెందిన వడిశెట్టి ఆంజనేయులు అనే వ్యక్తి ప్రయత్నిస్తున్నాడని స్థానికులు ఆరోపిస్తున్నారు.
అలాగే నీలంవాండ్ల పల్లె లో పోతా రామయ్య అనే వ్యక్తి కి 40 సంవత్సరాల నుంచి అనుభవం ఉన్న భూమి కబ్జా కు యత్నం జరుగుతున్నది. అనుభవం ఉన్న భూమిలో వారిని రాకుండా చంపుతామంటూ బెదిరిస్తూ దౌర్జన్యం చేస్తున్నారు. ఆంజనేయులు బెదిరింపులకు భయపడి రామయ్య ఆత్మహత్యాయత్నం చేసుకుంటానని చెబుతున్నాడు.
ఇప్పటికైనా జిల్లా కలెక్టర్, అధికారులు, స్పందించి న్యాయం చేయాలంటూ కుటుంబసభ్యులు కన్నీరు మున్నీరు అవుతున్నారు. తనకు ఆంజనేయులు నుంచి ప్రాణ హాని ఉందని అన్నమయ్య జిల్లా ఎస్పీ రక్షణ కల్పించాలని కుటుంబ సభ్యులు కోరుతున్నారు.