కాకినాడ ప్రెస్ క్లబ్ కార్యాలయంలో జర్నలిస్టుల మిత్రులందరు ఆత్మీయంగా కలుసుకున్నారు. మంగళవారం ఉదయం నుంచి కాకినాడ రామారావు పేటలో ఉన్న కాకినాడ ప్రెస్ క్లబ్లో కలుసుకొని ఆత్మీయత వేడుకలను నిర్వహించుకున్నారు. ఈ సందర్భంగా ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో అందరికీ ఆత్మీయ విందును ఏర్పాటు చేశారు.
అంతకుముందు తూర్పు వాణి 2023 క్యాలెండర్ను ప్రెస్ క్లబ్లో జర్నలిస్టు మిత్రుల సమక్షంలో ఆవిష్కరించారు. ఇకనుండి కాకినాడ ప్రెస్క్లబ్లో కార్యక్రమాలను వేగవంతం చేయాలంటూ మిత్రులు కోరారు. అనంతరం కొద్దిసేపు జర్నలిస్టు మిత్రుల ఆరోగ్య, కుటుంబ వివరాల గురించి ఒకరినొకరు అడిగి తెలుసుకుని ఆత్మీయ కరజాలంతో అందరూ ముందుగా సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసుకున్నారు.