అన్నమయ్య జిల్లా రాజంపేట లో జడ్పీ చైర్మన్ అకేపాటి అమరనాధ రెడ్డి వర్గీయుడు నంద లూరు వైసీపీ మండల కన్వీనర్ సిద్దవరం గోపీరెడ్డి ఎమ్మెల్యే మేడా వెంకట మల్లిఖార్జున రెడ్డి వర్గీయులపై ఆరోపణలు చేస్తూ బుధవారం ఆర్.అండ్.బి. బంగాళా లో మీడియా సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా గోపీరెడ్డి మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉండగా అప్పుడు కబ్జాకు పాల్పడి వైసీపీ లో చేరి వాటి క్రమబద్దీకరణకు ప్రయత్నాలు చేస్తున్న కొందరిపై కలెక్టర్ గిరీషా కు ఫిర్యాదు చేశామన్నారు.
పార్టీని నమ్ముకున్న వారికి,పెద్ద ప్రజలకి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కోరిక మేరకు భూములు ఇవ్వాలన్నదే మా ఆకాంక్ష అని తెలిపారు.నాపై భూ కబ్జాలు చేసినట్టు ఆరోపించిన వారు తెలుగుదేశం నుంచి వచ్చి మళ్ళీ ఇతర ర్టీలోకి వెళ్లే వారని ఆరోపించారు.నా పేరిట ఉన్న భూములు బాధితుల నుంచి కొనుగోలు చేసినవి కబ్జా చేసినని కావని, అందుకు సంబంధించిన ఆధారాలు తన వద్ద ఉన్నాయని అన్నారు.తాళ్ళపాక లో కబ్జా జరిగిందనే రిజిస్ట్రేషన్ రద్దు చేసి చర్యలు చేపట్టారని,ఆల్విన్ కర్మాగారం వద్ద,తాళ్ళపాక వద్ద భూ కబ్జాలో అసలు వారిని వదిలి అమాయక అధికారులను బలి సారని ఆరోపించారు.వారి కబ్జాలు నియోజకవర్గ పరిధిలోని అన్నీ ప్రాంతాల్లో కొనసాగుతున్నాయన్నారు.నేను కబ్జాలు చేసి ఉంటే నాపై చర్యలు తీసుకోవాలని, లేకపోతే ఆదమ్ము వారికి ఉందా అని గోపి రెడ్డి ప్రశ్నించారు.ఈ సమావేశంలో నందలూరు మండల వైసీపీ బీసీ కన్వీనర్ చుక్క వెంకటేశ్వరయ్య,గుజ్జుల ఈశ్వరయ్య తదితరులు పాల్గొన్నారు.