భాషా సంస్కృతులను రక్షించుకునేందుకు ప్రతి ఒక్కరూ సిద్ధంగా ఉండాలని, ఇందుకు తన వంతు సహకారం తప్పకుండా ఉంటుందని ఉత్తర అమెరికా తెలుగు అసోసియేషన్ అధ్యక్షుడు బాపయ్య చౌదరి అన్నారు. ఖమ్మం లకారం ట్యాంక్ బండ్ వద్ద పుస్తక మహోత్సవం వేదికగా జరుగుతున్న దిక్సూచి – కవి సమ్మేళనంలో ఆయన పాల్గొని ప్రసంగించారు.
ఈ సందర్భంగా వారు తమ అసోసియేషన్ ద్వారా భాషా సంస్కృతులు, సంప్రదాయాలను కాపాడుకోవడానికి చేస్తున్న కార్యక్రమాలను వివరించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ సాహితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె ఆనందాచారి, తెలంగాణ బుక్ ట్రస్ట్ కార్యదర్శి కోయ చంద్రమోహన్, సీనియర్ కవి జీవన్, డా. పోతగాని సత్యనారాయణ, కటుకొఝ్వుల రమేష్, జిగీష, తోట సుభాషిణి, తాళ్ళూరి రాధ తదితరులు పాల్గొన్నారు.