37.2 C
Hyderabad
May 2, 2024 11: 45 AM
Slider నిజామాబాద్

మానవత్వం చాటిన సర్పంచ్ భర్త: అనాథ శవానికి అంత్యక్రియలు

#kamareddy

ఎవరో తెలియదు. ఎక్కడి నుంచి వచ్చాడో అంతకన్నా తెలియదు. తన ప్రాంతంలో మృత్యువాత పడ్డాడు. ఫోటో తీసి ఆచూకీ చెప్పాలని సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన స్పందన రాలేదు. దాంతో పెద్ద మనసుతో ఆనంద్ అంత్యక్రియలు నిర్వహించారు. ఆనంద్ ఎవరా అనుకుంటున్నారా? కామారెడ్డి జిల్లా సదాశివనగర్ మండలం పద్మాజీవాడి గ్రామ సర్పంచ్ మడిపెద్ది కవిత భర్త. పద్మాజీవాడి చౌరస్తా వద్ద ఉదయం గుర్తు తెలియని వృద్ధుడు మృతి చెందాడు. ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా తెలియజేసినా స్పందన రాకపోవడంతో గ్రామ సర్పంచ్ మడిపెద్ది కవిత భర్త ఆనంద్ వృద్ధుని అంత్యక్రియలకు ఏర్పాట్లు చేశారు. గ్రామస్తుల సహాయంతో వైకుంఠదామంలో వృద్ధునికి అంత్యక్రియలు చేయించారు. దాంతో పలువురు గ్రామస్తులు సర్పంచ్ ఆనంద్ ను అభినందించారు.

Related posts

నల్లకుంటలో దొడ్డి కొమురయ్య 75వ వర్ధంతి

Satyam NEWS

మద్యం దుకాణాల్లో చేతివాటం రూ.20 లక్షల వరకూ గోల్‌మాల్‌

Satyam NEWS

మురుగుపారు…పశువులు సేద తీరు…

Bhavani

Leave a Comment