32.2 C
Hyderabad
May 2, 2024 00: 26 AM
Slider మహబూబ్ నగర్

భూ వివాదం పై చంపుతామని న్యాయవాదికి బెదిరింపు

#contempt of court

భూ వివాదంలో హైదరాబాద్ కు చెందిన  న్యాయవాదులను బొడికె  సత్యం అపహరించి చంపుతామని బెదిరించినట్లు కల్వకుర్తి బార్ అసోసియేషన్ అధ్యక్షులు జి. వెంకటయ్య గౌడ్ ఒక ప్రకటనలో తెలిపారు.

నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తి నియోజకవర్గంలోని లింగసానిపల్లి గ్రామానికి చెందిన బొడికె  సత్యం తనకు వ్యతిరేకంగా వాదించిన హైదరాబాద్ కు చెందిన న్యాయవాదులు ఎన్. పాండు ఎన్. ఆంజనేయులు దావా సంఖ్య 379/2021  తమ క్లయింట్ పొలంలోకి రాకుండా మధ్యంతర ఉత్తర్వులు ఇప్పించారనే ఆగ్రహంతో  అపహరించి చంపుతామని బెదిరించడమే గాక తమ కుటుంబ సభ్యులను  అసభ్య పదజాలంతో దూషించినందుకు వెంటనే అతన్ని అరెస్టు చేయాలని కల్వకుర్తి బార్ అసోసియేషన్ అధ్యక్షులు జి వెంకటయ్య గౌడ్, ఉపాధ్యక్షులు జమీల్ అహ్మద్, జనరల్ సెక్రెటరీ వెంకట రమణ డిమాండ్ చేశారు.

తనకు నక్సలైట్లకు సంబంధం ఉందని మిమ్మల్ని చంపడం చాలా సులభమని బెదిరించడం చూస్తుంటే న్యాయవాదుల రక్షణ లేకుండా పోతుందని ఇలాంటి వారిని ఉపేక్షించకుండా కఠినంగా శిక్షించాలని, భవిష్యత్తులో ఇటువంటి సంఘటనలు జరగకుండా చట్టాన్ని రూపొందించాలని వారు కోరారు.

Related posts

మహా శివరాత్రి బ్రహ్మోత్సవాలకు శ్రీశైలం సిద్ధం

Bhavani

ఎస్ఎల్‌జీ ఆసుప‌త్రితో మ‌హేశ్వ‌ర మెడిక‌ల్ కాలేజి ఒప్పందం

Satyam NEWS

కేసీఆర్ సర్కార్ ఉత్సవాలకు ధీటుగా బీజేపీ కార్యక్రమాలు……!

Bhavani

Leave a Comment