31.7 C
Hyderabad
May 2, 2024 09: 39 AM
Slider ఖమ్మం

మాజీ ఎంపీ పొంగులేటిపై బీఆర్ఎస్ లోక్ సభా పక్ష నాయకులు

#Leaders of BRS Lok Sabha party

ఖమ్మం ఎంపీ నామ నాగేశ్వరరావు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. సత్తుపల్లి లో జరిగిన ఆత్మీయ సమ్మేళనం లో మాట్లాడుతూ పార్టీపై ఆయన వ్యాఖ్యల పట్ల ఘాటుగా స్పందించారు. ఆహంభావంతో పొంగులేటి బీఆర్ఎస్ ప్రజా ప్రతినిధులను కించపరిచే విధంగా మాట్లాడడం బాధాకరమని నామ నాగేశ్వరరావు పేర్కొన్నారు.రానున్న ఎన్నికల్లో ఉమ్మడి ఖమ్మం జిల్లా నుంచి ఒక్కరినీ కూడా అసెంబ్లీ గేటు తాకనివ్వనని బీఆర్ఎస్ ప్రజా ప్రతినిధులను అగౌర్వ పర్చేవిధంగా మాట్లాడం పొంగులేటిలోని ఆహంభావానికి నిదర్శనమన్నారు.

ప్రజాస్వామ్యంలో ఎవర్ని గెలిపించాలో ప్రజలు తీర్పు ఇస్తారని, కానీ పొంగులేటి ప్రజల్ని కూడా భేఖాతరు చేస్తూ అప్రజాస్వామికంగా మాట్లాడడం ఆయన ఆహంభావ స్వభావానికి పరాకాష్ట అని ధ్వజమెత్తారు.పొంగులేటి అలా మాట్లాడడం కరెక్ట్ కాదు…. ఇప్పటికైనా పద్ధతి మార్చుకోవాలన్నారు.లేకుంటే వచ్చే ఎన్నికల్లో ప్రజలే పొంగులేటికి తగిన తీర్పు ఇస్తారని అన్నారు. ఎవరు ఎన్ని విధాలుగా మాట్లాడినా ఉమ్మడి ఖమ్మం జిల్లాలో 10కి 10 సీట్లు బీఆర్ఎస్ గెలుచుకుని తీరుతుందని నామ స్పష్టం చేశారు.పార్టీ ద్వారా లబ్ది పొంది కేసీఆర్, కేటీఆర్ లను విమర్శిస్తే సహించేది లేదన్నారు.

ఏ తప్పు చేసి కేసీఆర్ గారి కాళ్ళ మీద పడ్డారో ఆయనకే తెలియాలని నామ అన్నారు.ఎన్నికల ప్రజా క్షేత్రంలోనే ఎవరి సత్తా ఏమిటో ప్రజలే తెలుస్తారని నామ తెలిపారు.పొంగులేటి కి పార్టీ ఎన్నో అవకాశాలు ఇచ్చింది.. కానీ అన్నింటినీ ఆయన చేజార్చుకున్నారని అన్నారు.ప్రజాస్వామ్యంలో అంతిమ న్యాయ నిర్ణేతలు ప్రజలే…వారిని కూడా పొంగులేటి ఖాతరు చేయకపోవడం ఆయనలోని దుందుకుడు స్వభావానికి, అహంహకారానికి మచ్చుతునకన్నారు.పార్లమెంట్ లో తెలంగాణా బిల్లుపై మొదటి ఓటు తనదేనని నామ గుర్తు చేశారు.పొంగులేటి ….చరిత్ర తెలుసుకుని మాట్లాడా ల్సిందిగా సూచించారు.


ఎవరు అవకాశవాదో ఉమ్మడి ఖమ్మం జిల్లా ప్రజలకు తెలుసని, చరిత్ర, వాస్తవాలు తెలుసుకొని మాట్లాడితే మంచిదని నామ అన్నారు.14 ఏళ్ళు ప్రాణాలకు ఒడ్డి..ఉవ్వెత్తున ఉద్యమించి తెలంగాణా సాధించిన సీఎం కేసీఆర్ పై అవాకులు, చవాకులు పేలితే సహించేది లేదని అన్నారు.తెలంగాణా రాకముందు ఎట్లుండే…. ఇప్పుడెలా ఉందొ అందరికీ తెలిసిందేనని, ఇంతటి అభివృద్ధి కి కారణమైన కేసీఆర్ పై అబాండాలు వేస్తే తెలంగాణ సమాజం ఊరుకోదన్నారు.

రానున్న ఎన్నికల్లో ఉమ్మడి ఖమ్మం జిల్లాలో అన్ని సీట్లు బీఆర్ఎస్ కైవశం చేసుకుంటుందని అన్నారు. పార్టీలో ఉంటూనే పార్టీ అభ్యర్థులను ఓడగొట్టిన చరిత్ర నీదని నామ ఘాటుగా స్పందించారు. తన దగ్గరున్న ఆధారాలు, ఫిర్యాదులు ఆధారంగానే సీఎం కేసీఆర్ టిక్కెట్ ఇవ్వకుండా పక్కన బెట్టారని అన్నారు. కేసీఆర్ ఆశీర్వాదం, ప్రజల దీవెనలు వల్ల తాను బ్రహ్మాoడమైన మెజార్టీతో గెలిచి పార్లమెంట్ కు పోయానని ,ప్రజలందరికీ తాను పాదాభివందనం చేస్తున్నట్లు పేర్కొన్నారు.


ఎవరూ వ్యక్తిగతంగా మాట్లాడకూడదు.. డబ్బు.. పదవులు, అధికారం శాశ్వతం కాదని నామ గుర్తు చేశారు. ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో రాజ్యసభ సభ్యులు బండి పార్థసారధి రెడ్డి, వద్దిరాజు రవిచంద్ర, రైతు బంధు జిల్లా కన్వీనర్ నల్లమల వెంకటేశ్వరరావు, డీసీసీబీ చైర్మన్ కూరాకుల నాగభూషణం, డీసీఎంఎస్ చైర్మన్ రాయల శేషగిరిరావు,ఇంకా పార్టీ జిల్లా అధ్యక్షులు, ఎమ్మెల్సీ తాతా మధు తదితరులు పాల్గొన్నారు.

Related posts

దటీజ్ పినరయ్: అర్ధరాత్రి అడవిలో అమ్మాయిల ఆక్రందన

Satyam NEWS

భారత్ లో ఉండటం క్షేమం కాదు వెంటనే వచ్చేయండి

Satyam NEWS

Analysis: ఆగుతున్న శ్వాసను నిలబెట్టే ఆశ

Satyam NEWS

Leave a Comment