39.2 C
Hyderabad
May 3, 2024 13: 43 PM
Slider వరంగల్

నల్ల బ్యాడ్జీలతో ఎల్ ఐ సీ ఏజెంట్ల నిరసన

#lic

భారతీయ జీవిత బీమా ఏజెంట్ల సమాఖ్య, లియాఫి ఆల్ ఇండియా పిలుపు మేరకు ములుగు జిల్లా కేంద్రంలో నేడు ఎల్ ఐ సి ఏజెంట్లు నల్లబ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపారు. 11 నుంచి 14 తేదీ వరకూ ఎల్ ఐ సీ ఏజెంట్ల శలవు దినాలుగా సమాఖ్య ప్రకటించింది. ఈ మేరకు ములుగు జిల్లా కేంద్రంలో ములుగు లియాఫి అధ్యక్షులు బండపల్లి రవీందర్ ఆధ్వర్యంలో ఏజెంట్లు నల్ల బ్యాడ్జిలు ధరించి శాంతియుతంగా ధర్నా నిర్వహించారు.

పాలసీ ల పై GST ని రద్దు చేయాలని, పాలసీలపై బోనస్ ను పెంచాలని వారు డిమాండ్ చేశారు. అదే విధంగా పాలసీ లోన్ పై వడ్డీ రేటు తగ్గించాలని కూడా వారు కోరారు. తమ డిమాండ్స్ నెరవేర్చదాకా నిరసనలు ఆగవు అని వరంగల్ డివిజన్ పొలిటికల్ యాక్షన్ కమిటీ చైర్మన్ గారైన డి. పి. జనార్ధన్ అన్నారు. ఈ ధర్నా లో అధ్యక్షులు ఏ.శోభన్ జనరల్ సెక్రటరీ యం.సదానందం, నాయకులు కె.సాంబశివ, కె.సంపత్, ఎస్.కోటయ్య, కె.సత్యం, పి.విజయకుమార్, టి. నగేష్ తదితరులు పాల్గొన్నారు.

Related posts

రైతు బాలాజీకి సీఎం కేసీఆర్ నుంచి పిలుపు

Satyam NEWS

టాటా మోటార్స్ నుంచి ఎలక్ట్రిక్ కారు విడుదల

Satyam NEWS

మెట్లపై నుంచి పడిపోయిన రష్యా అధ్యక్షుడు పుతిన్

Satyam NEWS

Leave a Comment