ఇప్పటివరకు సిమ్లా, కశ్మీర్ వంటి చల్లని ప్రాంతాల్లోనే కాసే ఆపిల్ పండ్లు ఇప్పుడు తెలంగాణలో కూడా సాగు చేస్తున్నారు. ఆదిలాబాద్ కు చెందిన బాలాజీ అనే రైతు ఆపిల్ పంట సాగు చేసి, మంచి దిగుబడి సాధించాడు. ఈ మేరకు రైతు బాలాజీకి సీఎం కేసీఆర్ నుంచి పిలుపు వచ్చింది.
బాలాజీని హైదరాబాద్ తీసుకురావాలని సీఎం అధికారులను ఆదేశించారు. రైతు బాలాజీ తన ఆపిల్ పంట తొలి ఫలాలను సీఎంకు కానుకగా అందించనున్నారు. బాలాజీ పై మెట్రోటీవీ ప్రత్యేక కథనాన్ని ప్రసారం చేసిన తర్వాత విషయం వెలుగులోకి వచ్చింది.