కడప జిల్లా ఖాజీపేట దగ్గర భారీగా కర్ణాటక మద్యాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అధికార పార్టీకి చెందిన వ్యక్తి కారులో మద్యాన్ని గుర్తించినట్లు పోలీసులు తెలిపారు. బి.మఠం మండలం వైసీపీ సోషల్ మీడియా కన్వీనర్ శివరామకృష్ణ కారులో 50 కేస్ ల మద్యం సీసాలను గుర్తించామని పోలీసులు చెప్పారు. మద్యం తరలింపు వ్యవహారంపై శివరామకృష్ణను విచారించినట్లు పోలీసులు వెల్లడించారు.
previous post