హైదరాబాద్ నల్లకుంట డివిజన్ శ్రీవిద్య స్కూల్ లైన్స్, ఇందిర నగర్ లలో సమస్యలు తెలుసుకుంటూ స్థానిక నాయకులతో కలసి డివిజన్ కార్పొరేటర్ గరిగంటి శ్రీదేవి రమేష్ పర్యటించారు.
ఈ సందర్బంగా కార్పొరేటర్ దృష్టికి వచ్చిన సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. కొన్ని చోట్ల చీకటిగా ఉందని నూతన స్ట్రీట్ లైట్స్ ఏర్పాటు చేయించాలని స్థానికులు కోరారు.
అక్కడక్కడా పాడయి పోయిన రోడ్డు కొత్తవి వేయించాలని, నూతనం స్పీడ్ బ్రేకర్స్ వేయించాలని కోరగా వెంటనే కార్పొరేటర్ స్పందించారు. తక్షణమే ఆమె సంబంధిత అధికారులతో మాట్లాడారు.
వీలయినంత తొందరలో ఆ పనులు పూర్తి చేస్తామని తెలిపారు.
ఈ కార్యక్రమంలో K.శ్యామ్, శ్రీనివాస్, ప్రకాష్, హనుమంత్, శీను, కృష్ణ, గ్యానేశ్వర్, రమేష్,చందు, శంకర్, బాలరాజ్, యాదగిరి, జీహెచ్ ఎం సి సిబ్బంది పాల్గొన్నారు.