42.2 C
Hyderabad
May 3, 2024 18: 35 PM
Slider ముఖ్యంశాలు

రఘురామ వ్యవహారంలో లోక్ సభ స్పీకర్ జోక్యం చేసుకోవాలి

#NadendlaManohar

పార్లమెంటు సభ్యుడు కె.రఘురామకృష్ణంరాజు పట్ల ఏపి ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుపై లోక్ సభ స్పీకర్ ఓ బిర్లా జోక్యం చేసుకోవాలని జనసేన పార్టీ డిమాండ్ చేసింది. సుమోటోగా ఈ సంఘటనను తీసుకుని లోక్ సభ స్పీకర్ స్వతంత్ర విచారణకు ఆదేశించాలని జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ కోరారు. ఈ మేరకు ఆయన లోక్ సభ స్పీకర్ కు లేఖ రాశారు. ఎంపి రఘురామకృష్ణంరాజు పట్ల పోలీసుల తీరును ప్రజాస్వామ్య వాదులు అందరూ ఖండించాలని ఆయన కోరారు. డాక్టర్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగానికి లోబడి అధికారులు వ్యవహరించాలని ఆయన అన్నారు. అలా కాకుండా విచారణ పేరుతో అనుచితంగా ప్రవర్తించడం దారుణమైన విషయమని నాదెండ్ల మనోహర్ అన్నారు. పోలీసు విభాగంలోని కొందరు వ్యక్తులు రఘురామకృష్ణంరాజు వ్యవహారంలో చట్టానికి తూట్లు పొడిచారని ఆయన అన్నారు. లోక్ సభ్యుడి విషయంలోనే ఇలా జరుగుతుంటే ఆంధ్రప్రదేశ్ లో ఇక సామాన్యుడి పరిస్థితి ఎలా ఉంటుందో అర్ధం చేసుకోవచ్చునని ఆయన అన్నారు.

Related posts

ప్రజాగళం వినిపించే కుండబద్దలు సుబ్బారావు మృతి బాధాకరం

Bhavani

మరో లాక్‌డౌన్.. సీఎంలతో ప్రధాని భేటీ

Sub Editor

సిబిఐటి లో పరీక్షా పే చర్చ 2023

Satyam NEWS

Leave a Comment