కడప జిల్లా రాజంపేట నియోజకవర్గ వ్యాప్తంగా తెలుగు దేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ బాబు 39వ జన్మదినోత్సవం సందర్భంగా పలు సేవా కార్యక్రమాలను టీడీపీ నేతలు ఘనంగా నిర్వహించారు. రాజంపేట మండలం మందపల్లె గ్రామంలో ఆదివారం టీడీపీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్ జన్మదినోత్సవం సందర్భంగా ఎన్టీఆర్ ట్రస్ట్ అధ్వర్యంలో వైద్య శిబిరం ఏర్పాటు చేశారు.
రాజంపేట మున్సిపాలిటీలోని 16వ వార్డు సుద్ధ గుంతలలో ఎంపీపీ స్కూల్ వద్ద తెలుగు యువత కార్యవర్గ సభ్యులతో కలిసి కేక్ కట్ చేసారు. అదే విధంగా యువతకు క్రికెట్ కిట్లను అందజేశారు. అనంతరం తెలుగింటి ఆడ పడుచులకు చీరలు పంపిణీ చేశారు.
చౌడేశ్వరి అమ్మవారి ఆలయంలో పూజలు నిర్వహించారు. ఈ కార్య క్రమాలను టీడీపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రాజంపేట నియోజకవర్గ ఇంచార్జ్ బత్యాల చంగల్ రాయుడు ఈ శిబిరాన్ని ప్రారంభించారు. అదేవిధంగా నందలూరు మండలంలోని నాగిరెడ్డి పల్లె లో లోకేష్ జన్మదిన వేడుకలను కేక్ కట్ చేసి వేడుకగా నిర్వహించ గా ముఖ్య అతిధిగా తెలుగు యువత పార్లమెంట్ అధ్యక్షుడు నవీన్ కుమార్ రెడ్డి తదితరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.