ప్రియుడితో పెళ్లి చేయాలని ఓ యువతి చేసిన పోరాటం ఎట్టకేలకు ఫలించింది. ములుగు మండలంలోని బండారుపల్లి గ్రామానికి చెందిన పెట్టెం సంతోష్ ప్రేమించి పెళ్లికి నిరాకరించడంతో ఈనెల 20న ప్రియుడి ఇంటి ముందు వరంగల్ రూరల్ జిల్లా ఆత్మకూర్ మండల కేంద్రానికి చెందిన నత్తి శ్రీ వాణి మౌనదీక్షకు దిగిన విషయం తెల్సిందే.
సత్యం న్యూస్ శ్రీ వాణి మౌనదీక్ష ను ప్రపంచానికి తెలిపింది. హన్మకొండ లోని ఒక ప్రైవేటు ఆసుపత్రిలో పనిచేస్తున్న ఈ క్రమంలో వీరి పరిచయం ఏర్పడి ప్రేమగా మారింది. దీంతో రెండేళ్లుగా ప్రేమలో ఉన్నారు.
పెళ్లి చేసుకుంటానని నమ్మించిన సంతోష్ శారీరకంగా దగ్గర కావడంతో తీరా పెళ్లి విషయం తెచ్చేసరికి ముఖం చాటేశాడు. దీంతో యువతి ప్రియుడు సంతోష్ స్వగ్రామమైన బండారుపల్లి గ్రామంలోని వారి ఇంటి వద్ద మార్చి 20న మౌన దీక్షకు దిగింది.
దీనికి ప్రజా సంఘాలు, ఎమ్మార్పీఎస్ నాయకులు కుల పెద్దలు సహకారంతో ఎట్టకేలకు పోలీస్ కౌన్సిలింగ్ ఇరువర్గాల కుల సంఘాల ఆధ్వర్యంలో ములుగు శివాలయం లో ఇద్దరికి ఎట్టకేలకు వివాహం చేశారు.
ఈ కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ రాష్ట్ర నాయకులు జన్ను రవి మాదిగ, చుంచు రవి ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ అండ్ మానిటరింగ్ కమిటీ జిల్లా కమిటీ సభ్యులు పాల్గొన్నారు.