33.7 C
Hyderabad
April 29, 2024 02: 05 AM
Slider ఖమ్మం

సుందరంగా ముస్తాబవుతున్న ఖమ్మం

#khammam

ఖమ్మం నగరం దినదినాభివృద్ధి చెందుతోంది. అభివృధ్ధిలో మెరుపు వేగంతో దూసుకుపోతుంది. ఖమ్మం నగరంలోని త్రీ టౌన్ ప్రాంతంలో ప్రజలకు ఆహ్లాదం పంచేందుకు పార్కులు, ఓపెన్ జిమ్ లు, వాకింగ్ ట్రాక్ లు, గ్రీనరి, పబ్లిక్ టాయిలెట్స్ ఇలా అన్ని వసతులతో అన్ని ప్రాంతాల్లో ప్రజల అభ్యర్థన మేరకు చకచకా చేస్తున్నారు. నగరంలోని 3టౌన్ ప్రాంతంలో మురికి కుపానికి నిలయం అయిన గోళ్ళపాడు ఛానల్ ను ఆధునీకరించదమే కాకండా దానిపై దాదాపు 13 కీలోమీటర్లు ఉన్న దానిపై ప్రజలు వినియోగించుకోవడానికి, ఆహ్లాదం పొందడానికి ఏర్పాట్లు చేశారు. త్రీ టౌన్ 29వ డివిజన్ ప్రకాష్ నగర్ లో గల గొల్లపాడు ఛానల్ పై నిర్మిస్తున్న పార్క్ పూర్తి చేసుకుంటున్నాయి. మొత్తం 5పర్కులు ఎర్పాటు చేయగా ఇప్పటికే రెండు పర్కులు ప్రారంభించగా, మరో మూడు పార్కులు ప్రారంభానికి సిద్దంగా ఉన్నాయి. ఒకప్పుడు మురికి కూపానికి నిలయంగా ఉన్న గొళ్ళపాడు ఛానెల్ నేడు ప్రజలందరు చిన్న పెద్దా తేడా లేకుండా అహ్లదంలో మునిగి తేలియాడుతారు. మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ఆలోచన, ముందు చూపుతో ఖమ్మం నగరం నేడు అభివృద్ధికి చిరునామాగా నిలిచిందని, ఒకప్పుడు దుర్భరమైన నివసాలుగా పిలిచే ప్రాంతంలో నేడు ఇక్కడ ఇళ్ళ స్థలాలు కొనుక్కోవడానికి, స్థిర నివాసం ఏర్పాటు చేసుకోవడానికి ప్రజలు ఆశక్తి చూపిస్తున్నారని స్థానిక ప్రజలు చెబుతున్నారు.

Related posts

రాష్ట్ర ప్రభుత్వం రైతులకు ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చి తీరాలి

Satyam NEWS

జగన్ సలహాదారు ఇప్పుడు ఇక ఎన్నికల కమిషనర్

Satyam NEWS

పొంగులేటి సమక్షంలో కాంగ్రెస్ లో చేరిన ప్రజాప్రతినిధులు

Satyam NEWS

Leave a Comment